అటు పెళ్లికి వెళ్లారు.. ఇటు దొంగలు పడ్డారు

53చూసినవారు
అటు పెళ్లికి వెళ్లారు.. ఇటు దొంగలు పడ్డారు
కొమురంభీం జిల్లా సిర్పూర్ (టి) మండలంలో తాళం వేసిన ఓ ఇంట్లో దొంగతనం జరిగిన ఘటన చోటుచేసుకుంది. పేట్మహేల కాలనీకి చెందిన అబ్దుల్ అస్లాం గత నెల 19న తన బంధువుల పెళ్లికి హైదరాబాద్ కు వెళ్లారు. ఈ నెల తిరిగి వచ్చి చూడగ బీరువా పగలగొట్టి ఉంది. సుమారు రూ. 20, 000 నగదు, తులం బంగారం, 24 తులాల వెండి చోరీ జరిగినట్లు గుర్తించారు. శుక్రవారం బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్