అంతర్ రాష్ట్ర చెక్ పోస్టులను పరిశీలించిన ఎన్నికల పరిశీలకులు

83చూసినవారు
అంతర్ రాష్ట్ర చెక్ పోస్టులను పరిశీలించిన ఎన్నికల పరిశీలకులు
ఎంపీ ఎన్నికల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో ఓటర్లను ప్రలోభాలకు గురికాకుండా అంతర్రాష్ట్ర చెక్ పోస్టుల వద్ద పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసి అక్రమ మద్యం, డబ్బు రవాణాను పగడ్బందీగా అరికట్టాలని ఎన్నికల వ్యయ పరిశీలకుడు రాంకుమార్ గోపాల్ అన్నారు. శనివారం భద్రాచలంలోని చర్ల రోడ్డు, కూనవరం రోడ్డులో ఏర్పాటు చేసిన చెక్ పోస్టులను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసి రిజిస్టర్లను వాహనాలను పరిశీలించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్