

సైన్యం దెబ్బకు శత్రుస్థావరాలు మట్టిలో కలిసిపోయాయి: మోదీ (VIDEO)
పాకిస్థాన్ ఎయిర్ క్రాఫ్ట్లు, మిస్సైళ్లు, డ్రోన్లు, యూఏవీలు భారత ఎయిర్ డిఫెన్స్ ముందు విఫలమయ్యాయని ప్రధాని మోదీ తెలిపారు. దేశంలోని అన్ని ఎయిర్ బేస్ల సిబ్బందికి ఆయన అభినందనలు తెలిపారు. మన సైన్యం శత్రు గూటికి చొచ్చుకెళ్లి ప్రతీకారం తీర్చిందని, అక్కాచెల్లెళ్ల నుదుటి సిందూరాన్ని తుడిచినవారి స్థావరాలను ధ్వంసం చేశామని తెలిపారు. భారత సైన్యం కొట్టిన దెబ్బకు శత్రుస్థావరాలు మట్టిలో కలిసిపోయాయన్నారు.