ఈదురుగాలులకు నేలకొరిగిన చెట్లు, విద్యుత్‌ స్తంభాలు

80చూసినవారు
దుమ్ముగూడెం మండలంలో ఆదివారం తెల్లవారుజామున ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన భారీవర్షం కురిసింది. సీతారాంపురంలో ప్రధాన రహదారిపై భారీ వృక్షం కూలిపోవడంతో చాలాసేపు వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. చెట్టు నెలకోరగడంతో విద్యుత్‌ స్తభం విరిగిపోయి వైర్లు తెగిపోయాయి. సమాచారం అందుకున్న విద్యుత్ సిబ్బంది చెట్టును తొలగించారు. విద్యుత్‌ అధికారులు, సిబ్బంది విద్యుత్‌ను పునరుద్ధరించే పనుల్లో నిమగ్నమయ్యారు

సంబంధిత పోస్ట్