గాంధీనగర్ లో కాలువలో పడి వ్యక్తి మృతి
బూర్గంపాడు మండలం గాంధీనగర్ లో కొత్తగా నిర్మిస్తున్న కాలువలో పడి వ్యక్తి మృతి చెందిన సంఘటన సారపాకలో మంగళవారం చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. గాంధీనగర్ కాలనీకి చెందిన భాస్కర్ రావు(53) ఐటీసీ కర్మాగారంలో కాంట్రాక్టు కార్మికుడిగా పని చేస్తున్నాడు. మంగళవారం తమ ఇంటి సమీపంలో నూతనంగా నిర్మించిన మురుగు కాలువను దాటే ప్రయత్నంలో దాంట్లో పడిపోయాడు. గమనించిన కుటుంబసభ్యులు ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందాడు.