పాల్వంచ పట్టణంలో రహదారులు జలమయం..!!

1515చూసినవారు
భద్రాద్రి జిల్లా పాల్వంచ పట్టణంలో రహదారులు జలమయం అయ్యాయి. అదేంటి ఎండాకాలంలో రహదారులు జలమయం కావడం ఏంటని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారా. అవునండీ మున్సిపాలిటీ వారు మంచినీరు వదిలారంటే ఆ రోజంతా రోడ్లన్నీ జలమయం అవుతాయి. ఎండాకాలంలో కూడా రోడ్లన్నీ జలమయం కావడంతో ప్రజలు అవాక్కవుతున్నారు. ప్రతి వార్డులలో కూడా మంచినీటి పైపులు లీకేజీ ఉండటం వల్ల త్రాగు నీరు వృధా అవుతుందని స్థానికులు ఆవేదన చెందుతున్నారు.

సంబంధిత పోస్ట్