కర్ణాటక మాజీ సీఎం హెచ్డీ కుమారస్వామి, ఆయన భార్య అనిత పేరిట మొత్తం రూ.217.21 కోట్ల ఆస్తులున్నాయి. మండ్య లోక్సభ స్థానానికి గురువారం కుమారస్వామి నామినేషన్ వేశారు. ఎన్నికల అఫిడివిట్లో తన ఆస్తుల వివరాలను పొందుపరిచారు. తన పేరిట రూ.54.65 కోట్ల విలువైన ఆస్తులుండగా, భార్య అనితకు రూ.154.39 కోట్ల ఆస్తులున్నాయని పేర్కొన్నారు. రూ.82.17 కోట్ల అప్పులు కూడా ఉన్నట్లు అఫిడవిట్లో వెల్లడించారు.