మట్టి పోసి చుక్కలు చూపిస్తున్న మున్సిపల్ అధికారులు

75చూసినవారు
కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడినట్లుగా మారింది మణుగూరు మున్సిపాలిటీ అధికారుల తీరు. అసలే గుంటలతో నరకయాతన అనుభవిస్తున్న మణుగూరు మండలం శివలింగాపురం ప్రజలకు బురద మట్టిని పోసి చుక్కలు చూపిస్తున్నారు. మణుగూరు మున్సిపాలిటీ అధికారుల తీరుపై శివలింగాపురం, బాపనకుంట, మణుగూరు ప్రాంత ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే రోడ్డు మరమ్మతులు నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్