మాజీ మంత్రి కేటీఆర్ త్వరలోనే చర్లపల్లి జైలుకి పోవడం ఖాయమని ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పిడమర్తి రవి విమర్శించారు. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి బీజేపీలోకి వెళ్తున్నాడని కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ.. కేటీఆర్ కు మతి భ్రమించి మాట్లాడుతున్నారని అన్నారు. బుధవారం గాంధీభవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ గురించి తర్వాత.. ముందు లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టైన మీ చెల్లెను కాపాడుకో అని ఎద్దేవా చేశారు.