మహా కుంభమేళా బుధవారంతో ముగిసింది. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ ట్విట్టర్ ఎక్స్లో ట్వీట్ చేశారు. ‘మహా కుంభ్ ముగిసింది.. ఐక్యతతో మహా యజ్ఞం పూర్తయింది. ప్రయాగ్రాజ్లో జరిగిన ఐక్యత మహా కుంభ్లో 140 కోట్ల మంది విశ్వాసం ఏకమైంది. గత 45 రోజులుగా దేశ, ప్రపంచ నలుమూలల నుంచి ప్రజలు తరలివచ్చి ఈ ఉత్సవంలో చేరిన తీరు చాలా అద్భుతం’ అని మోడీ అన్నారు.