వైఎస్ జగన్ ఓటమికి అమరావతి ఉద్యమం కూడా ఒక ముఖ్య కారణమని బీజేపీ నేత, జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి పేర్కొన్నారు. ఏపీ రాజధాని శిబిరాల వద్దకు విచ్చేసిన ఆయన మాట్లాడుతూ.. రాజధానిని తరలించాలని చూసిన జగన్కు జనం బుద్ధి చెప్పారన్నారు. వైసీపీ త్వరలోనే భూస్థాపితం అవుతుందన్న ఆయన.. ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు బీజేపీలో చేరాలని చూస్తున్నారని వెల్లడించారు. అయితే, వారిని బీజేపీలో చేర్చుకోబోమని స్పష్టం చేశారు.