రామన్ పాడు ప్రాజెక్టు వద్ద మత్సకారుల ఆందోళన

74చూసినవారు
దేవరకద్ర నియోజకవర్గం మదనాపురం మండలం రామన్ పాడు ప్రాజెక్టు రహదారిపై మత్స్యకారులు రోడ్డు దిగ్బంధం చేసి ఆందోళనకు దిగారు. రామన్ పాడు ప్రాజెక్టు దిగువకు ఒకేసారి 10 గేట్లు ఎత్తడంతో తాము చేపల కోసం వేసిన వలలు కొట్టుకుపోయాయని ఆందోళన చేపట్టారు. జీవనాధారమైన వలలు కోల్పోవడంతో భారీ నష్టం వాటిల్లిందని ఆందోళన చేపట్టారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మత్స్యకారులకు నచ్చ చెప్పడంతో ఆందోళనను విరమించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్