ముంబైలో వలస కూలీ మృతి

9550చూసినవారు
ముంబైలో వలస కూలీ మృతి
మహబూబ్ నగర్ జిల్లా మహ్మదాబాద్ మండల పరిధిలోని జూలపల్లి మంగలికుంట తండాకు చెందిన చంద్ర నాయక్(50) అనే వ్యక్తి ముంబైకి వలస వెళ్లి కార్మికుడిగా పనిచేస్తున్నాడు. గత మూడు రోజుల క్రితం అస్వస్థతకు గురికాగా కుటుంబ సభ్యులు ముంబైలోని ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించగా, చికిత్స పొందుతూ సోమవారం అర్ధరాత్రి మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. అతనికి భార్య, ఇరువురు కుమారులు ఉన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్