జోగులాంబ గద్వాల జిల్లా ఎర్రవల్లి మండల కేంద్రంలో ఆదివారం ఉపాధి హామీ కూలీలకు రాహుల్ గాంధీ కీలక హామీ ఇచ్చారు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రూ. 250 కూలీని రూ. 400లకు పెంచుతామని తెలిపారు. అలాగే పేద మహిళలకు ఏడాదికి రూ. లక్ష నగదు బ్యాంకు ఖాతాలో జమ చేస్తామని వెల్లడించారు. పేదవారిని ధనవంతులను చేయడమే తమ పార్టీ లక్ష్యమని అన్నారు. మరోవైపు దేశవ్యాప్తంగా జనగణన నిర్వహించి రిజర్వేషన్లు అమలు చేస్తామన్నారు.