జోగులాంబ గద్వాల జిల్లా ఎస్పీ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎస్ రితిరాజ్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర అవతరించి పదేళ్లు పూర్తి చేసుకుందన్నారు. రాష్ట్రం అభివృద్ధి చెందడంలో పోలీసుల పాత్ర ఎంతో ఉందని అన్నారు. జిల్లా ప్రభుత్వ పోలీసు అధికారులు, నాయకులు, ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.