తహశీల్దార్ ఆఫీసులో పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నం

16463చూసినవారు
జోగులాంబ గద్వాల జిల్లా అయిజ తహశీల్దార్ ఆఫీసులో పెట్రోల్ పోసుకొని బుధవారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. భూసమస్య పరిష్కరించాలని 6 ఏళ్లుగా ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని అయిజకు చెందిన రంగు లక్ష్మీదేవి, సుభద్రమ్మ, రోహిణి, మహేశ్వరమ్మ, గోవిందమ్మ ఆగ్రహం చెందారు. దీంతో ఆఫీసులో పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేయగా సిబ్బంది వారించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్