వంతెనపై నిలిచిన వాహనాలు.. ప్రయాణికులకు తప్పని అవస్థలు

547చూసినవారు
జోగులాంబ గద్వాల జిల్లా అయిజ పట్టణంలోని ప్రధాన రహదారిపై నిర్మించిన వంతెన పూర్తయినప్పటికీ దానిని ఇంతవరకు ప్రారంభించలేదు. దీని కారణంగా కొత్త బస్టాండు వెనుక బాగాన ఉన్న చిన్న వంతెన పై వాహనాలు వెళుతున్నాయి. గురువారం వంతెనపై వాహనాలు నిలిచిపోవడంతో సుమారు గంటపాటు ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. వేరే మార్గం లేక అవస్థలు పడాల్సి వచ్చింది. కొత్త వంతెనను ప్రారంభించాలని ప్రయాణికులు కోరుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్