మహబూబ్ నగర్ ఎంపీ స్థానానికి కాంగ్రెస్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన అనంతరం చల్లా వంశీచంద్ రెడ్డి దంపతులు శనివారం తిరుమల తిరుపతి శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. శ్రీవారి పుణ్యదర్శనానంతరం దైవ ప్రసాదం స్వీకరించారు. మహబూబ్ నగర్ ఎంపీగా విజయానికి పొందాలని తిరుమల తిరుపతి దేవస్థానం వేదపండితులు పవిత్ర ఆశీర్వచనం ప్రసాదించారు.