అడుగంటిన భూగర్భ జలాలు... ఆందోళనలో రైతులు

2615చూసినవారు
అడుగంటిన భూగర్భ జలాలు... ఆందోళనలో రైతులు
మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లాలో మార్చిలోనే ఎండలు ముదురుతున్న కొద్దీ, రోజు రోజుకు భూగర్భ జలాలు అడుగంటుతున్నాయి. గత సంవత్సరం వర్షాకాలంలో సెప్టెంబర్ తర్వాత తగినంతగా వర్షాలు లేకపోవడంతో జలాశయాలు నిండలేదు. దీంతో గ్రౌండ్ వాటర్ లేక బావులు, బోర్లు ఎండిపోతున్నాయి. మరో వైపు ఎండ తీవ్రత పెరగడంతో పంటలకు ఎక్కువ మోతాదులో నీరు అవసరమవుతోంది. యాసంగి పంట చేతికి రాకపోవడంతో ఉమ్మడి జిల్లాలో రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్