మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్లలోని 14వ వార్డుకు చెందిన బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు 120 మంది ఎమ్మెల్యే జనంపల్లి అనిరుద్ రెడ్డి సమక్షంలో గురువారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. కాంగ్రెస్ ప్రభుత్వంలోనే పేదలకు సంక్షేమ పథకాలు అందుతాయన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో అభివృద్ధి సాధ్యమన్నారు.