మురికి కూపంగా పాలకొండ చెరువు

81చూసినవారు
మహబూబ్ నగర్ జిల్లాలో రెండు దశాబ్దాల క్రితం పాలకొండ పరివాహక ప్రాంతాల ఆయకట్టుకు సాగునీరు అందించిన పాలకొండ చెరువు నేడు మురికినీటి కూపంగా మారింది. పాలకొండ చెరువులోకి మహబూబ్ నగర్ పట్టణానికి సంబంధించిన ఒక ప్రాంతం నుంచి పెద్ద ఎత్తున మురుగునీరు వస్తుండడంతో ఆ ప్రాంతమంతా దుర్గంధభరితంగా మారింది. చెరువులో ఉన్న నీరు కూడా పూర్తిగా విషపూరితంగా మారిపోయింది. చెరువు నీటిపై పెద్ద ఎత్తున మురుగు నీటి తెప్పలు పేరుకుపోయాయి.

సంబంధిత పోస్ట్