రైతు వేదికను ఉపయోగంలోకి తీసుకురావాలి: ఎమ్మెల్యే

51చూసినవారు
రైతు వేదికను ఉపయోగంలోకి తీసుకురావాలి: ఎమ్మెల్యే
మహబూబ్ నగర్ జిల్లా రూరల్ మండల పరిధిలోని ఓబులాయపల్లి గ్రామ రైతు వేదికను ఉపయోగంలోకి తీసుకురావాలని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మంగళవారం రైతులతో కలిసి రైతు వేదిక చుట్టూ ఉన్న పరిసరాలను కలివిడిగా తిరిగి పరిశీలించారు. రైతు వేదిక ను శుభ్రంగా ఉంచుకోవాలని నిర్వాహకులకు సూచించారు. కాసేపు రైతులతో ముచ్చటించారు. అలాగే రైతు రుణమాఫీ గురించి అడిగి తెలుసుకున్నారు.

సంబంధిత పోస్ట్