నాపై కుట్ర జరుగుతోంది: సీఎం రేవంత్ రెడ్డి

581చూసినవారు
నాపై కుట్ర జరుగుతోంది: సీఎం రేవంత్ రెడ్డి
కాంగ్రెస్ మెజార్టీని తగ్గించి తనను కిందపడేయాలని కొందరు కుట్ర చేస్తున్నారని సోమవారం సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. 'ఇందుకోసం బీజేపీ, బిఆర్ఎస్ కలిసి కుట్రలు చేస్తున్నాయి. నన్ను దెబ్బతీయడానికి గూడుపుటానీ చేస్తున్నారు. నేను ఎక్కడున్నా నా గుండె చప్పుడు కొడంగల్ మాత్రమే. దేశంలోనే ఈ నియోజకవర్గాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతాం. ఈ కుట్రలు, కుతంత్రాలను తిప్పికొట్టాలి' అని శ్రేణులకు సీఎం పిలుపునిచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్