కల్వకుర్తి పట్టణంలో శనివారం ఉదయం బిఆర్ఎస్ నాగర్ కర్నూల్ పార్లమెంట్ అభ్యర్థి ప్రవీణ్ కుమార్ జోరుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రస్తుతం కొనసాగుతున్న 33 జిల్లాలను 15 జిల్లాలకు తగ్గించాలానే ఆలోచన వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఉప సంహరించు కోవాలని అన్నారు. పరిపాలన సౌలభ్యం కోసం కేసీర్ 33జిల్లాలు ఏర్పాటు చేస్తే రేవంత్ రెడ్డి తగ్గించాలని చూడడం సరైంది కాదని అన్నారు.