ప్రజల భద్రతకే పోలీస్ శాఖ ఆధ్వర్యంలో కార్డన్ సర్చ్ చేపట్టినట్లు సిఐ శివకుమార్ తెలిపారు. వనపర్తి జిల్లా మక్తల్ నియోజకవర్గ పరిధిలోని అమరచింత మండల కేంద్రంలో శనివారం డిఎస్పి వెంకటేశ్వరరావు, సిఐ శివకుమార్ కార్డెన్ సర్చ్ నిర్వహించారు. దీంతో 37 బైకులు ఒక ఆటోను స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. నేరాలను నియంత్రనకు, ప్రజలకు భద్రత కల్పించేందుకు కార్దెన్ సెర్చ్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు.