రైతుల సమస్యలపై శుక్రవారం నారాయణపేట మున్సిపల్ పార్క్ ముందు బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించే సత్యాగ్రహ దీక్షలు పార్లమెంట్ అభ్యర్థి డీకే అరుణ పాల్గొంటారని ఆ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి రఘువీర్ యాదవ్ తెలిపారు. ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు సత్యాగ్రహ దీక్ష నిర్వహిస్తున్నట్లు చెప్పారు. నిరసన కార్యక్రమానికి పార్టీ పదాదికారులు, నాయకులు, కార్యకర్తలు హాజరు కావాలని కోరారు.