పదోన్నతులు బాధ్యతలు పెంచుతాయి: ఎస్పీ

68చూసినవారు
పదోన్నతులు బాధ్యతలు పెంచుతాయి: ఎస్పీ
విధి నిర్వహణలో పదోన్నతులు బాధ్యతలను పెంచుతాయని ఎస్పీ యోగేష్ గౌతమ్ అన్నారు. ఏఎస్సై గా పదోన్నతులు పొందిన హెడ్ కానిస్టేబుల్ కథలప్ప, రెడ్యానాయక్ లకు సోమవారం నారాయణపేట ఎస్పీ కార్యాలయంలో స్టార్స్ ను దరింపజేశారు. ఎస్పీ మాట్లాడుతూ. ఎక్కడ విధులు నిర్వహించిన బాధ్యతగా నిర్వహించాలని, అప్పగించిన పనులను పకడ్బందీగా నిర్వహించాలని చెప్పారు. ప్రజలకు సేవ చేయాలని అన్నారు. సీఐ రాంలాల్, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్