వనపర్తి జిల్లా మంగంపల్లిలో పెద్దమందడి, ఖిల్లాఘనపురం మండలాల కాంగ్రెస్ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనం సోమవారం నిర్వహించారు. సమ్మేళనానికి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి హాజరయ్యారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ. ఎంపీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీని భారీ మెజార్టీతో గెలిపించాలన్నారు. బిజెపి బిఆర్ఎస్ ఒక్కటేనని, బిజెపికి ఓటేసిన బిఆర్ఎస్ కు ఓటేసినట్టే బిఆర్ఎస్ కు ఓటేస్తే బిజెపికి ఓటు వేసినట్టే అని అన్నారు. కాంగ్రెస్ ను ఆదరించాలన్నారు.