శ్రీరంగాపురం ఆలయ హుండీ ఆదాయం లెక్కింపు

2584చూసినవారు
శ్రీరంగాపురం ఆలయ హుండీ ఆదాయం లెక్కింపు
వనపర్తి జిల్లా శ్రీరంగాపురం మండల కేంద్రంలోని రంగనాథ ఆలయం హుండీ ఆదాయాన్ని గురువారం లెక్కించారు. రెండు నెలలుగా రూ. 2, 02, 281 ఆదాయం సమకూరిందని ఆలయ కార్యనిర్వహణాధికారి శేఖర్ గౌడ్, పరిశీలకుడు ఆంజనేయులు తెలిపారు. రంగనాథుడు జాతర ఉగాది పండగ వరకు కొనసాగుతుందని ఈఓ తెలిపారు. కార్యక్రమంలో కార్యనిర్వాహక కమిటీ సభ్యులు మధుమోహన్ రెడ్డి, వినయ్ కుమార్ రెడ్డి, పర్యవేక్షకుడు మహేశ్, ఆలయ అర్చకులు, సిబ్బంది పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్