అంబలి కేంద్రం ప్రారంభించిన మాజీ ఎంపీ

57చూసినవారు
అంబలి కేంద్రం ప్రారంభించిన మాజీ ఎంపీ
వనపర్తి జిల్లా కొత్తకోట మండలం కానాయపల్లి స్టేజి సమీపంలో వార్డు సభ్యులు బాజ గిరన్న ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అంబలి కేంద్రాన్ని గురువారం మాజీ ఎమ్మెల్యే, మాజీ ఎంపీ రావుల చంద్రశేఖర్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ. వేసవికాలంలో బాటసారులకు వేసవి తాపాన్ని తీర్చేందుకు అంబలి కేంద్రాన్ని ఏర్పాటు చేయడం సంతోషకరమన్నారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్