ఉమ్మడి జిల్లా స్థాయి ఆట పోటీలను ప్రారంభించిన జి. చిన్నారెడ్డి

66చూసినవారు
వనపర్తి జిల్లా రూరల్ మండలం చిట్యాల మహాత్మా జ్యోతిభ పూలే గురుకుల పాఠశాలలో ఉమ్మడి జిల్లా స్థాయి ఆట పోటీలను బుధవారం రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు జిల్లెల చిన్నారెడ్డి ప్రారంభించారు. చిన్నారెడ్డి మాట్లాడుతూ. విద్యార్థులు చదువులో, ఆటలో రాణించి ఉన్నత స్థాయిలోకి రావాలని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి తో మాట్లాడి చిట్యాల బీసీ గురుకుల స్కూల్ ఇంటర్మీడియట్ స్థాయికి అప్ గ్రేడ్ చేయడానికి ప్రయత్నం చేస్తానని హామీ ఇచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్