షటిల్ ఆడిన ఎంపీ అభ్యర్థి మల్లు రవి

69చూసినవారు
పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం వనపర్తి జిల్లా పెబ్బేరు మండల కేంద్రంలో నాగర్ కర్నూల్ కాంగ్రెస్ అభ్యర్థి మల్లు రవి పర్యటించారు. ఈ సందర్భంగా ప్రజలతో ఆయన మాట్లాడుతూ.. పార్లమెంట్ ఎన్నికల్లో తనను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. అనంతరం క్రీడాకారులతో కలిసి కాసేపు ఆయన షటిల్ గేమ్ ఆడారు. మల్లు రవి షటిల్ ఆడుతున్న దృశ్యాన్ని అక్కడ ఉన్న వారు ఆసక్తిగా చూశారు.

సంబంధిత పోస్ట్