వనపర్తి జిల్లా కేంద్రంలో బండారు నగర్ టిఫిన్ సెంటర్ గోపాల్(52) గుండెపోటుతో ఆకస్మికంగా మృతి చెందారు. ఇంట్లో ఉండగా ఛాతిలో నొప్పి వస్తుందని చెప్పడంతో వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించగా పరీక్షించిన వైద్యులు అప్పటికే చనిపోయినట్లు నిర్ధారించారు. ఈ వార్త విని తట్టుకోలేని ఆయన పెద్ద కుమారుడు అస్వస్థతకు గురయ్యారని కుటుంబీకులు తెలిపారు. బుధవారం భౌతికకాయాన్ని ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి సందర్శించి నివాళులర్పించారు.