వనపర్తి జిల్లాలో కొత్తగా ఏర్పాటు చేసిన చిన్నంబావి, రేవల్లి, మదనాపూర్ మండలాలలో పశువైద్యశాలలు లేక పాడి రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఉమ్మడి జిల్లాలో గొర్రెలు, పాడిపశువులు, కోళ్ల సంఖ్య పెరిగి పశువైద్య సేవలకు డిమాండ్ ఏర్పడింది. పాత మండలాలలో కూడా పశువైద్య కేంద్రాలలో పూర్తిస్థాయిలో సిబ్బంది లేక పశు వైద్యసేవలు లభించడం లేదని, కొత్త మండలాలలో పశువైద్య కేంద్రాలను ఏర్పాటు చేయాలని గురువారం రైతులు కోరుతున్నారు.