పదోతరగతి ఫలితాలపై సందేహాలను నివృత్తి చేసుకోవడానికి విద్యార్థులు పునర్ మూల్యాంకనానికి, పునఃపరిశీలనకు దరఖాస్తులు చేసుకోవాలని గురువారం వనపర్తి డీఈఓ గోవిందరాజులు తెలిపారు. రీకౌంటింగ్ కోసం రూ. 500, రీవెరిఫికేషన్ కోసం ఒక సబెక్టుకు రూ. 1000/- చెల్లించాలన్నారు. ఈ నెల 15వరకు దరఖాస్తులు చేసుకోవాలన్నారు. పూర్తి వివరాలకు పాఠశాల ప్రధానోపాధ్యాయులను సంప్రదించాలని పేర్కొన్నారు.