ప్రమాదంలో మలావీ దేశ ఉపాధ్యక్షుడు కన్నుమూత

16624చూసినవారు
ప్రమాదంలో మలావీ దేశ ఉపాధ్యక్షుడు కన్నుమూత
ఆర్మీ ఎయిర్‌క్రాఫ్ట్‌ ప్రమాదంలో మలావీ దేశ ఉపాధ్యక్షుడు సావులోస్‌ చీలిమా(51) కన్నుమూశారు. ఆయనతో పాటు మరో తొమ్మిది మంది ఈ ప్రమాదంలో చనిపోయారని అధికారులు ప్రకటించారు. అధికారిక కార్యక్రమం కోసం ఆయన బృందంతో సోమవారం బయల్దేరగా కాసేపటికే రాడార్‌ నుంచి ఆ ఎయిర్‌క్రాఫ్ట్‌ సంబంధాలు తెగిపోయాయి. విఫ్య పర్వతాల్లోని చికంగావా అడవుల్లో కూలిపోయిన విమాన శకలాలను గుర్తించారు. అందులో ఎవరూ సజీవంగా లేరని అధికారిక ప్రకటన వెలువడింది.

సంబంధిత పోస్ట్