ప్రధానిపై మమతా బెనర్జీ ఆసక్తికర వ్యాఖ్యలు

74చూసినవారు
ప్రధానిపై మమతా బెనర్జీ ఆసక్తికర వ్యాఖ్యలు
ప్రధాని కోసం ఏదైనా వండేందుకు తాను సిద్ధంగా ఉన్నానని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అన్నారు. శ్రీరామనవమి నవరాత్రుల సమయంలో ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్‌ చేపలు తినడంపై ప్రధాని మోదీ విమర్శలు చేశారు. ఈ వ్యవహారంపై దీదీ స్పందించారు. ‘ప్రధాని కోసం ఏదైనా వండేందుకు సిద్ధంగా ఉన్నా. కానీ నా చేతివంటను మోదీ అంగీకరిస్తారో, లేదో? శాకాహారంతో పాటు చేపల కూర లాంటి మాంసాహార భోజనం కూడా బాగా వండొచ్చు’ అని వ్యాఖ్యానించారు.

సంబంధిత పోస్ట్