రంగారెడ్డి జిల్లా టంగుటూర్లో విషాదం చోటుచేసుకుంది. శంబారెడ్డి అనే వ్యక్తి కరెంట్ షాక్తో మృతి చెందాడు. సినిమా షూటింగ్ కోసం లోకేషన్ చూపిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మృతుడి కుటుంబసభ్యులు మోకీలా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా పోలీసులు పట్టించుకోకపోవడంతో రోడ్డుపై బైఠాయించి ధర్నా చేపట్టారు.