బెల్లంపల్లి... బీఆర్ఎస్ నిరసన

68చూసినవారు
రైతు భరోసా నిధులు వెంటనే మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ బెల్లంపల్లి ఎంపీడీవో కార్యాలయ రోడ్డు వద్ద బీఆర్ఎస్ శ్రేణులు నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య హాజరయ్యారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నాయకులు పెద్దపెట్టున నినాదాలు చేశారు. ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా రైతు భరోసా డబ్బులను రైతుల ఖాతాల్లో జమ చేయాలని మాజీ ఎమ్మెల్యే డిమాండ్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్