పద్మా రెడ్డి అంతిమయాత్రలో పాల్గొన్న బెల్లంపల్లి ఎమ్మెల్యే

50చూసినవారు
పద్మా రెడ్డి అంతిమయాత్రలో పాల్గొన్న బెల్లంపల్లి ఎమ్మెల్యే
మాజీ సీడీఎస్ అధ్యక్షురాలు తోడే పద్మా రెడ్డి అంతిమయాత్రకు సోమవారం బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ హాజరయ్యారు. పద్మారెడ్డి గుండె సంబంధిత వ్యాధితో ఆదివారం మృతిచెందగా ఆమె అంత్యక్రియలు మంచిర్యాలలోని గౌతమి నగర్ లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన హాజరై ఆమె పార్థివ దేహం వద్ద పూలమాలవేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్