శాంతిఖని గనిపై ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు

51చూసినవారు
రంజాన్ పండుగను పురస్కరించుకొని బెల్లంపల్లి పట్టణంలోని శాంతిఖని గని క్యాంటీన్లో సోమవారం రాత్రి ముస్లింలకు ఇఫ్తార్ విందు నిర్వహించారు. టీబీజీకేఎస్ ఐఎన్టియుసి హెచ్ఎంఎస్ సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన విందులో ముస్లిం కార్మికులు, మైనార్టీ నాయకులు పాల్గొని విందును స్వీకరించారు. అంతకుముందు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ కార్యక్రమంలో పలు యూనియన్ సంఘం నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్