బాలికలు, మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని రామగుండం సిపి రెమా రాజేశ్వరి హెచ్చరించారు. పోక్సో కేసుల్లో చట్టాలు కఠినంగా అమలవుతున్నాయని తెలిపారు. ప్రధానంగా తల్లిదండ్రుల పాత్ర కీలకం, బాలలను వారి హక్కులను కాలరాయకుండా వారి వారిని స్వేచ్ఛ వాతావరణంలో సంరక్షించాలని పేర్కొన్నారు. మహిళల రక్షణ కోసం షీ టీం ప్రత్యేకంగా పనిచేస్తోందని. నిర్భయంగా ఫిర్యాదు చేయాలన్నారు.