సింగరేణిలో గెలిచిన సంఘాలకు గుర్తింపు పత్రాలు ఇవ్వాలి

574చూసినవారు
సింగరేణిలో గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు జరిగి వంద రోజులు గడిచినా నేటికీ గెలిచిన సంఘాలకు గుర్తింపు పత్రాలు ఇవ్వడం లేదని ఎఐటియుసి అధ్యక్షుడు సీతారామయ్య అన్నారు. సోమవారం ఆయన మాట్లాడుతూ కార్మిక శాఖ, యాజమాన్యానికి లేఖ రాసిన ఒకరిపై ఒకరు నెపం వేసుకుంటూ పార్లమెంటు ఎన్నికల కోడ్ పేరుతో గుర్తింపు సంఘం పత్రాలు ఇవ్వకుండా కాలయాపన చేస్తున్నారని ఆరోపించారు. వెంటనే గుర్తింపు పత్రాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్