కోటపల్లి మండలం కేంద్రంలో ఆదివారం తెలంగాణ మోడల్ హైస్కూల్ ప్రవేశ పరీక్ష సజావుగా జరిగింది. 6వ తరగతి ప్రవేశ పరీక్షకు 50 మంది విద్యార్థులు, 7 నుండి 10 తరగతి ప్రవేశ పరీక్షకు 20 మంది విద్యార్థులు హాజరయ్యారు. నిర్ణీత సమయానికి అరగంట ముందుగానే విద్యార్థులు కేంద్రానికి చేరుకొని ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాశారని చీఫ్ సూపరిండెంట్ తుమ్మల లక్ష్మారెడ్డి, డిపార్ట్మెంటల్ ఆఫీసర్ గుండేటి యోగేశ్వర్ తెలిపారు.