దండం పెట్టి.. అమ్మవారి నగలు దొబ్బేశాడు (వీడియో)

554చూసినవారు
అమ్మవారికి దండం పెట్టి ఓ వ్యక్తి నగలు దొబ్బేశాడు. ఈ ఘటన ఏలూరు జిల్లాలోని సత్రంపాడులో చోటు చేసుకుంది. సౌభాగ్యలక్ష్మి గుడిలో అమ్మవారి దర్శనానికి ఓ దొంగ వచ్చాడు. అమ్మవారికి దండం పెట్టి అటూ ఇటూ చూశాడు. ఆలయంలో ఎవరూ లేకపోవడంతో అమ్మవారి పది కాసుల మంగళసూత్రాన్ని కాజేసి పరారయ్యాడు. పోలీసులు కేసు నమోదు చేసి సీసీ ఫుటేజీని పరిశీలించారు. వీడియో ఆధారంగా నిందితుడ్ని పట్టుకునేందుకు గాలిస్తున్నారు.

సంబంధిత పోస్ట్