![తాళ్లపెట్ లో ఉచిత కంటి పరీక్ష శిబిరం తాళ్లపెట్ లో ఉచిత కంటి పరీక్ష శిబిరం](https://media.getlokalapp.com/cache/0c/1d/0c1d5cf7dd845fac04430a690184f128.webp)
తాళ్లపెట్ లో ఉచిత కంటి పరీక్ష శిబిరం
మంచిర్యాల జిల్లా బీజేపీ అధ్యక్షులు వేరబెల్లి రఘునాథ్ ఆదేశాల మేరకు దండేపల్లి మండలం తాళ్లపెట్ గ్రామపంచాయతీలో వేరబెల్లి పౌండేషన్ వారి సహకారంతో మండల బీజేవైఎం అధ్యక్షులు ఎర్రం నరేష్ ఆధ్వర్యంలో శనివారం ఉచిత కంటి పరీక్ష శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ శిబిరంలో 50 మందికి పరీక్షలు నిర్వహించగా, అందులో 22 మందికి ఆపరేషన్ అవసరం ఉండగా, ఉచిత కంటి ఆపరేషన్ కేంద్రాలకు తరలించడం జరిగిందని ఎర్రం నరేష్ తెలిపారు.