రోడ్డు ప్రమాదంలో ఒకరికి తీవ్రగాయాలు
దండేపల్లి మండలంలోని కన్నెపల్లి, గూడెం గ్రామాల సమీపంలో బుధవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు- ఐచర్ వ్యాను ఢీకొన్న ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న నలుగురిలో ఒక మహిళకు తీవ్ర గాయాలు కాగా, మరో ముగ్గురు స్వల్పంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని క్షతగాత్రులను చికిత్స కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.