సికిల్ సెల్, ఎనీమియా, సీజనల్ వ్యాధులపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని మంచిర్యాల జిల్లాలోని పలు నియోజకవర్గ ప్రజలు కోరుతున్నారు. సీజనల్ వ్యాధుల గురించి అవగాహన లేకుండా అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారని స్థానిక ప్రజలు ఆవేదన వ్యక్తం చేసారు. సంబంధిత అధికారులు వ్యాధుల పట్ల, వాటి నిర్ములన గురించి అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని శనివారం ప్రజలు కోరారు.