రామగుండం పోలీస్ కమీషనరేట్ హెడ్ క్వార్టర్స్ లో సోమవారం హోలీ పండుగ సంబరాలు అట్టహాసంగా జరిగాయి. ఈ సంబరాల్లో సిపి
ఎం. శ్రీనివాస్, మంచిర్యాల డిసిపి అశోక్ కుమార్, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా పోలీస్ అధికారులు, సిబ్బంది ఒకరిపైఒకరు రంగులు చల్లుకున్నారు. అనంతరం సిపి మాట్లాడుతూ హోలీ వేడుకలను ప్రజలంతా ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని కోరారు. రంగులు చల్లుకునే సమయంలో తగు జాగ్రత్తలు పాటించాలని సూచించారు.