యూపీలోని బారాబంకీలో బుధవారం ఆశ్చర్యకర ఘటన జరిగింది. నగరంలోని సిటీ లా కాలేజీలో LLB పరీక్షలు జరుగుతున్నాయి. అయితే పరీక్షల్లో విద్యార్థులు కాపీయింగ్కు పాల్పడ్డారు. ఇదంతా ఇన్విజిలేటర్ల సమక్షంలోనే జరిగింది. ముందుగా వారి నుంచి కొంత రుసుము వసూలు చేసి, కాపీయింగ్కు ఇన్విజిలేటర్లు ప్రోత్సహించినట్లు ఆరోపణలు వచ్చాయి. భవిష్యత్తులో న్యాయవాదులు, న్యాయమూర్తులు కావాల్సిన వారు ఇలా చేయడంపై విమర్శలొస్తున్నాయి.